గత వారం కంటే తక్కువ సంఖ్యలో కోవిడ్ -19 కేసులు

గత వారం కంటే తక్కువ సంఖ్యలో కోవిడ్ -19 కేసులు

ఢిల్లీ ప్రజలకు ఊరట కలిగించే వార్తను చెప్పారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆదివారం కోవిడ్ -19 పై మాట్లాడిన ఆయన ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉందన్నారు. గతవారం కంటే కేసులు, రికవరీ విషయంలో తేడాలు ఉన్నాయని అన్నారు. గతవారం కంటే కేసులు దాదాపు 200 తక్కువగా నమోదు అయ్యాయని ఆయన వెల్లడించారు. ఏడవ వారంలో 850 కేసులు, 21 మరణాలు , 260 రికవరీలు ఉన్నాయని.. అయితే ఎనిమిదవ వారంలో మాత్రం 622 కేసులు, 9 మరణాలు , 580 రికవరీలు ఉన్నాయని చెప్పారు.

ఈ లెక్కలతో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వస్తుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కేంద్రం లాక్ డౌన్ విషయంలో ఇచ్చిన సడలింపులను అమలు చేస్తామని చెప్పిన కేజ్రీవాల్.. ప్రజలకు అవసరమైన షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. మాల్స్ , షాపింగ్ కాంప్లెక్స్ లలో ఉండే మార్కెట్లకు అనుమతి లేదని.. కేవలం నివాస ప్రాంతాలలో ఉన్న దుకాణాలను మాత్రమే తెరవబడతాయని చెప్పారు. ఇక హాట్‌స్పాట్స్‌లో ఉండే షాపులకు మాత్రం అనుమతి ఇవ్వలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story