coronavirus : 27 వేలకు చేరువలో కేసులు

coronavirus : 27 వేలకు చేరువలో కేసులు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,975 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 26,917కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇక ఇప్పటివరకు మహమ్మారి భారిన పడి భారతదేశంలో 826 మంది మృతి చెందగా. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5,914 మంది డిశ్చార్జ్‌ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

కరోనా ద్వారా అత్యంత ప్రభావవంతమైన రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది.. ఇక్కడ మొత్తం 7,628 కరోనా కేసులు నమోదు కాగా, 323 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 3,071, ఢిల్లీలో 2,625, మధ్యప్రదేశ్‌లో 2,096 రాజస్తాన్‌లో 2,083, తమిళనాడు 1,821, ఉత్తరప్రదేశ్‌లో 1,843 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసులు వెయ్యి దాటాయి. ఇక్కడ నిన్న ఒక్కరోజే 80 కి పైగా కేసులు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story