coronavirus : భారత్ లో 23.83 శాతానికి పెరిగిన రికవరీ రేటు

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 29 వేల 680 కు పెరిగింది. మంగళవారం, తమిళనాడులో 121, ఆంధ్రప్రదేశ్లో 82, రాజస్థాన్లో 73, పశ్చిమ బెంగాల్లో 48 మందితో సహా 391 మంది నివేదికలు పాజిటివ్ గా రావడంతో మంగళవారం సాయంత్రానికి కేసులు 29 వేలు దాటాయి. అయితే ఈ రోజు పంజాబ్లో కొత్త కేసులు ఏవీ నమోదు కాలేదు, ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారిని 21 రోజుల పాటు నిర్బంధించాలని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయించారు.
మరోవైపు దేశంలో 29,435 మంది సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 21 వేల 632 మంది చికిత్స పొందుతున్నారు, 6868 మందికి నయమైంది. 934 మంది మరణించారు. కరోనా రోగుల రికవరీ రేటు 23.83 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ కుమార్ సాయంత్రం చెప్పారు. ప్రస్తుతానికి కరోనాకు మందు లేదని ఐసిఎంఆర్ చెబుతోందని ఆయన చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com