ఏపీలో మరో 73 మందికి కరోనా పాజిటివ్

ఏపీలో మరో 73 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు.. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 7727 సాంపిల్స్ ని పరీక్షించగా 73 మంది కోవిడ్-19 పాజిటివ్ గా వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 1332 చేరుకున్నాయి. అయితే ఇందులో 287 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1014 గా ఉంది. ఇక జిల్లాల వారీగా చూస్తే..

అనంతపురం 58, చిత్తూర్ 77, నెల్లూరు 82, కడప 69, కర్నూల్ 343, ప్రకాశం 60, కృష్ణా 236, గుంటూరు 283, పశ్చిమ గోదావరి 56, తూర్పు గోదావరి 40, విశాఖపట్నం 23, శ్రీకాకుళం 5గా ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసులలో అనంతపురం 4, చిత్తూర్ 3, కడప 4, కర్నూల్ 11, ప్రకాశం 4, కృష్ణా 13, గుంటూరు 29, పశ్చిమ గోదావరి 1, తూర్పు గోదావరి 1, విశాఖపట్నం 1, శ్రీకాకుళం 1 కేసులు నమోదు అయ్యాయి. ఈసారి నెల్లూరు తప్ప అన్ని జిల్లాల్లో కొత్త కేసులు నమోదు అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story