ఏప్రిల్, మే మాసాల్లో జీతాలు ఇవ్వలేం: స్పైస్జెట్
By - TV5 Telugu |29 April 2020 5:07 PM GMT
లాక్ డౌన్ అమల్లో ఉండటం వలన సంస్థ తీవ్రంగా నష్టపోయిందని.. దీంతో ఏప్రిల్, మే మాసాల్లో జీతాలు చెల్లించడం సాధ్యం కాదని స్పైస్జెట్.. తమ పైలెట్లకు తెలిపింది. కానీ, కార్గో పైలెట్లకు మాత్రం గంటల చొప్పున జీతాన్ని చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటివరకు 16 శాతం విమానాలు, 20 శాతం మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారాని.. 5 కార్గో విమానాలు పనిచేస్తున్నాయని తెలిపింది. సంస్థ నష్టాల్లో ఉందని.. కనుక.. ఏప్రిల్, మే మాసాల జీతాలు చెల్లించబడవని స్పష్టం చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com