కేరళలో కొత్తగా మరో 10 పాజిటివ్ కేసులు

X
By - TV5 Telugu |30 April 2020 2:53 AM IST
కేరళ రాష్ట్రంలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 495కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో ముగ్గురు హెల్త్ వర్కర్లు, ఒక జర్నలిస్ట్ ఉన్నట్లు సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. నమోదైన కొత్త కేసుల్లో 6 కేసులు కొల్లాంలో నమోదైనవేనని ఆయన వెల్లడించారు. కాగా, కరోనాను కట్టడి చేసేందుకు కేరళ గవర్నమెంట్ మాస్క్ను తప్పని సరి చేసింది. మాస్క్ ధరించికపోతే రూ.5వేలు జరిమానా విధిస్తామని తెలిపింది. కొన్ని చోట్లు గొడుగులు వేసుకుని దూరం పాటిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com