సింగపూర్‌లో 690 కొత్త వైరస్ కేసులు.. ఇందులో ఆరుగురే స్వదేశీయులు

సింగపూర్‌లో 690 కొత్త వైరస్ కేసులు.. ఇందులో ఆరుగురే స్వదేశీయులు

సింగపూర్‌లో బుధవారం 690 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం COVID-19 కేసులు 15,641 కి చేరుకున్నాయి.. వీరిలో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 690 తాజా కేసులలో, ఆరుగురు సింగపూర్ పౌరులు కాగా, మిగిలిన వారు వసతి గృహాలలో నివసించే విదేశీ వలస కార్మికులు. అయితే ఎక్కువగా విదేశీయులే తమ దేశంలో కరోనా భారిన పడ్డారని ఆయన.. ప్రస్తుతం వారి బాగోగులను సింగపూర్ ప్రభుత్వం చూస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

వసతి గృహాలలో నివసించే వర్క్ పర్మిట్ హోల్డర్ల ద్వారానే ఈ రోజు కేసుల పెరుగుదల కొనసాగుతోందని, విస్తృతమైన పరీక్షల కారణంగా ఇంకా చాలా కేసులు వస్తాయని అంచనా వేస్తున్నాము అని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 15,641 గా ఉందని తెలిపింది. కొత్త కేసులలో, 63 శాతం తెలిసిన క్లస్టర్లతో ముడిపడివున్నాయి, మిగిలినవి కాంటాక్ట్ ట్రేసింగ్ పెండింగ్లో ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story