మందుబాబులకు గుడ్ న్యూస్.. గ్రీన్‌ జోన్లలో మద్యం అమ్మకాలకు అనుమతి

మందుబాబులకు గుడ్ న్యూస్.. గ్రీన్‌ జోన్లలో మద్యం అమ్మకాలకు అనుమతి

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కరోనా కట్టడి చేయడానికి కేంద్ర సర్కార్ లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. అయినా దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించింది. లాక్‌డౌన్‌ రెండో దఫా ఈ నెల 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుంచి 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

అయితే గ్రీన్‌ జోన్లలో మద్యం, పాన్‌ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్‌ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story