యువ దర్శకుడు మృతి..

యువ దర్శకుడు మృతి..

గుండెపోటుతో యువదర్శకుడు రాజ్ మోహన్ (47) మరణించారు. కోవైకి చెందిన రాజ్ చెన్నైలో ఉంటూ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. అలైపిదళ్ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన రాజ్ తాజాగా కేడయం అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం విడుదల కావాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. కాగా, అవివాహితుడైన రాజ్ మిత్రుల ఇంట్లో భోజనం చేస్తుండేవాడు. గత కొన్ని రోజులుగా రాజ్ రావట్లేదని మిత్రులు రాజ్ నివసిస్తున్న కార్యాలయానికి వెళ్లి చూశారు.

కాలింగ్ బెల్ ఎంత సేపు కొట్టినా డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా రాజ్ విగత జీవిగా పడి ఉన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం చేయించారు. రిపోర్టులో గుండెపోటుతో మృతి చెందినట్లు వచ్చింది. కరోనా నేపథ్యంలో ఆ పరీక్షలు కూడా నిర్వహించారు. కానీ నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఈ మేరకు బంధువులకు సమాచారం అందించగా కరోనా భయంతో వారెవరూ రాలేదు. దాంతో మిత్రులే పోలీసుల సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story