ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు
By - TV5 Telugu |3 May 2020 2:00 PM GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు ఉధృతమవుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 6534 సాంపిల్స్ ని పరీక్షించగా 58 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. ఈ విషయాన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 1583 పాజిటివ్ కేసు లకు గాను 488 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1062 గా ఉంది. మరోవైపు జిల్లాలవారీగా కేసుల సంఖ్య ఇలా ఉంది.. అనంతపురం 78, చిత్తూరు 81, కడప 83, కర్నూల్ 466, నెల్లూరు 91, ప్రకాశం 61, గుంటూరు 319, కృష్ణా 266, పశ్చిమ గోదావరి 59, తూర్పు గోదావరి 45, విశాఖపట్నం 29, శ్రీకాకుళం 5గా ఉన్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com