కోవిడ్తో ‘లోక్పాల్’ త్రిపాఠీ కన్నుమూత
By - TV5 Telugu |3 May 2020 9:02 AM GMT
కరోనా మహమ్మారి కాటుకు లోక్పాల్ సభ్యుడు జస్టిస్ (రిటైర్డు) ఏకే త్రిపాఠీ(62) బలయ్యారు. ఇటీవల ఆయనకు కరోనా సోకింది. దాంతో చికిత్స పొందుతూ ఎయిమ్స్లో శనివారం రాత్రి కన్నుమూశారని అధికారులు వెల్లడించారు. కాగా ఆయన కుమార్తె, అలాగే ఇంట్లో పని చేసే పని మనిషికి కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది, అయితే వారు ఇప్పటికే వారు కోలుకున్నారని తెలిసింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన త్రిపాఠీ, ప్రస్తుత లోక్పాల్లోని నలుగురు సభ్యుల్లో ఒకరు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com