జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై
By - TV5 Telugu |3 May 2020 8:27 AM GMT
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా జర్నలిజం ఉండాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. భయం గాని, పక్షపాతం గాని లేని విధంగా జర్నలిస్టులు విధులు నిర్వహించాలని ఆమె కోరారు. ప్రస్తుతం పలు సవాళ్ళను ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com