పాక్లో 19 వేలు.. కరోనా పాజిటివ్ కేసులు

X
TV5 Telugu3 May 2020 8:29 PM GMT
కరోనా మహమ్మారి పాకిస్థాన్ దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఇక్కడ నమోదైన కేసుల సంఖ్య ఇప్పటికే 19 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగ 989 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 19,103కు చేరింది. కరోనా మరణాలు 440కు చేరుకుంది. పాక్ ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. కాగా, కరోనా నిర్ధారణ పరీక్షలు ఇప్పటి వరకు 2.03 లక్షల మందికి చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story