132 పట్టణాల్లో తెరుచుకోనున్న మసీదులు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఇరాన్ పైనా తన ప్రభావం చూపిస్తోంది. ఇరాన్లో ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల సుమారు 6500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాంతకర వైరస్ లక్ష మందికి పైనే సోకింది. ఈ నేపథ్యంలో ఇరాన్కు చెందిన ఆరోగ్యశాఖ దేశాన్ని మొత్తం మూడు జోన్లుగా విభజించింది. ఇన్ఫెక్షన్లు, మరణాల ఆధారంగా ఎల్లో, గ్రీన్, వైట్ జోన్లుగా వేరు చేసింది.
అయితే ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో.. కరోనా వైరస్ కేసులు తక్కువ ఉన్న ప్రాంతాల్లో మసీదులు తెరిచేందుకు అధ్యక్షుడు హసన్ రౌహనీ అంగీకారం తెలిపారు. సోమవారం నుంచి మసీదులు తెరుచుకోనున్నట్లు ఆయన తెలిపారు. 132 రిస్క్ పట్టణాల్లో.. మసీదులు ప్రార్థనలకు అందుబాటులో ఉంటాయన్నారు. అయితే హెల్త్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com