గడచిన 24 గంటల్లో 3900 కరోనా పాజిటివ్ కేసులు
By - TV5 Telugu |5 May 2020 1:06 PM GMT
దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3900 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 195 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,433కి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి 1568 మంది ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com