విశాఖలో రైల్వే ట్రాక్ పనులు.. ఆరుగురు మృతి
By - TV5 Telugu |5 May 2020 7:28 PM GMT
విశాఖపట్నం కేకే లైన్ రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనుల్లో భాగంగా రైల్వే ఉద్యోగులు పని చేస్తున్నారు. కొండ చరియలకు ఆనుకుని రైల్వే ట్రాక్ ఉండడంతో చరియలు విరిగిపడి ఆరుగురు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. పలువురు కూలీలు లోయలో పడిపోయారు. బొర్రాగుహలు-చిమిడిపల్లి రైల్వేస్టేషన్ల మద్య ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరిన్ని
వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com