ప్రమాదం జరిగినపుడు అలారం మోగాలి, కానీ.. అలా జరగలేదు: సీఎం జగన్
By - TV5 Telugu |7 May 2020 5:46 PM GMT
విశాఖ ఘటనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీ వేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న అంశంపై అధ్యయనం చేస్తారన్నారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, ప్రమాదం జరిగినప్పుడు అలారమ్ మోగాలని, కానీ అలా జరగలేదని జగన్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించారని, అపస్మారక స్థితిలో ఉన్న వారు కోలుకుంటున్నారని తెలిపారు సీఎం జగన్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com