కరోనా కారణంగా ఒక్కరోజే 2528 మంది మృతి
By - TV5 Telugu |7 May 2020 10:05 AM GMT
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. కరోనా విలయతాండవానికి .. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 2,65,045 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడిన వారి సంఖ్య 38.21 లక్షలు దాటింది. ఈ వైరస్ నుంచి 12.99 లక్షల మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అమెరికాలో కరోనాతో 74,799 మంది చనిపోగా, బుధవారం ఒక్కరోజే 2,528 మంది ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com