విశాఖ ఘటన నన్నెంతగానో కలచి వేసింది : ఉపరాష్ట్రపతి
By - TV5 Telugu |7 May 2020 1:49 PM GMT
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో వందలాది మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి పాలీవినైల్ క్లోరైడ్ గ్యాస్ లీకై 8 మంది మృత్యువాతపడ్డారు. వందకు పైగా వ్యక్తులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ వాయువును పీల్చిన వారు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో విశాఖలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
కాగ, విశాఖ ఘటన తనను ఎంతగానో కలచి వేసిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డితో మాట్లాడానని వెల్లడించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com