హైదరాబాద్ నుంచి స్వదేశానికి వెళ్లిపోయిన 81 మంది కెన్యా దేశస్థులు

X
By - TV5 Telugu |8 May 2020 11:06 PM IST
లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్లో చిక్కుకుపోయిన కెన్యా దేశస్థులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలించారు. బెంగుళూరులో చిక్కుకుపోయిన 51మంది, హైదరాబాద్ లో చిక్కుకున్న 32మంది కలిపి మొత్తం 83మందిని శంషాబాద్ విమానాశ్రయంనుంచి ప్రత్యేక విమానంలో కెన్యాకు తరలించారు. వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించి ప్రయాణానికి అనుమతిచ్చారు. లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో చిక్కుకుపోయిన వివిధ దేశాలకు చెందిన 8వందల మందిని, 12 ప్రత్యేక విమానాల ద్వారా వారి వారిదేశాలకు తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com