భూసేకరణ పేరుతో భూమాఫియా చేస్తున్నారు : టీడీపీ ఎమ్మెల్యే
By - TV5 Telugu |8 May 2020 5:07 PM GMT
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం భూసేకరణ పేరుతో భూమాఫియాకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు భూములు ఇచ్చిన వారినుంచి బెదిరించి కమీషన్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేత జేబులు నింపేందుకే.. జగన్ భూ పంపిణీ పథకం ప్రారంభించారని నిమ్మల ఆరోపించారు. పాత పథకాలను కొత్త పథకాలుగా చెప్పి.. ఆర్భాటంగా ప్రారంభించి చీకట్లో కొత్త దోపిడీ చేస్తున్నారన్నారు. భూ సేకరణ ద్వారా.. భూ యజమానులకు వెళ్లేది గోరంత అయితే.. వైసీపీ నేతల జేబుల్లోకి కొండంత వెళుతోందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com