రుణమాఫీ డబ్బులు విడుదల.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
By - TV5 Telugu |8 May 2020 3:45 PM GMT
తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రుణమాఫీ డబ్బులను విడుదల చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు పాలాభిషేకం చేస్తున్నారు. జిల్లాలోని నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లిలో రుణ మాఫీ డబ్బులు విడుదల చేశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పాలాభిషేకం నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తదితరులు కూడా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com