విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రుల ప్రత్యేక సమీక్ష

X
By - TV5 Telugu |8 May 2020 5:02 AM IST
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రుల ప్రత్యేక సమీక్షనిర్వహించారు. వైజాగ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు అండగా ఉంటామని మంత్రులు తెలిపారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం కల్పిస్తామని మంత్రులు పేర్కోన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com