తెలంగాణలో ఇంకా మూడు జిల్లాలు మాత్రమే గ్రీన్ జోన్‌లో

తెలంగాణలో ఇంకా మూడు జిల్లాలు మాత్రమే గ్రీన్ జోన్‌లో

కేంద్రమార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు తెలంగాణ ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్. తక్కువ టెస్టులు చేస్తున్నారన్న వాదనలో అర్ధం లేదన్నారు. రెడ్ జోన్లుగా ఉన్న వరంగల్ అర్బన్, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలు ఆరెంజ్ జోన్లుగా మారాయన్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలు మాత్రమే రెడ్ జోన్లుగా ఉన్నాయన్నారు. 75ఏళ్ల వృద్దుడు, గర్భిణీ లు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని మంత్రి వెల్లడించారు. హాట్ స్పాట్ లల్లో మరింత పకడ్బందిగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story