786 మంది రాష్ట్ర పోలీసులకు కరోనా

786 మంది రాష్ట్ర పోలీసులకు కరోనా

దేశంలో కరోనా కేసుల సంఖ్య మహారాష్ట్రలో అధిక మొత్తంలో నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 786 మంది పోలీసులకు కరోనా సోకిందని మహారాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది. వీరిలో 76 మంది కోలుకోగా, ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో పోలీసులపై దాడులు కూడా అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. రాష్ట్రంలో మార్చి 22 నుంచి 200 మంది పోలీసులపై దాడి కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్ నియమాలు ఉల్లంఘించినందుకు 660 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 22 నుంచి ఇప్పటి వరకు 80 మంది పోలీసులు వివిధ దాడుల్లో గాయపడ్డారు. లాక్డౌన్ నేపథ్యంలో 32 మంది ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story