తెలంగాణలో సమ్మెకు దిగిన ఆయిల్ ట్యాంకర్స్ యజమానులు

X
By - TV5 Telugu |11 May 2020 7:54 PM IST
ఆయిల్ ట్యాంకర్స్ యజమానులు ఆందోళన బాట పట్టారు. ట్రాన్స్ పోర్టర్స్ కు రావాల్సిన రవాణా ఛార్జీల్లో 80 కోత విధించడాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగారు. ప్రధానంగా సింగరేణికి సప్లైయ్ ని నిలిపివేశారు. దీంతో సూర్యాపేట సమీపంలోని HPCL ఆయిల్ టెర్మినల్ లో దాదాపు 5వందల ఆయిల్ ట్యాంకర్స్ నిలిచిపోయాయి. రూట్ మ్యాప్ ఇవ్వడంలేదని, టోల్ ఛార్జీలు చెల్లించడం లేదంటూ ఆరోపిస్తున్నారు. శాటిలైట్ రూట్ పేరుతో కిలోమీటర్ల మేర కోత పెడుతున్నారని ట్యాంకర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయిల్ టెర్మినల్ల్లో వందలాది ట్యాంకర్లు నిలిచిపోయాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com