మంత్రి అవంతి శ్రీనివాస్‌కు విశాఖ ఘటన సెగ

మంత్రి అవంతి శ్రీనివాస్‌కు విశాఖ ఘటన సెగ

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ బాధితులకు పరిహారం, సాయం విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందంటూ ఆర్‌ఆర్ వెంకటాపురంలో స్థానికులు ఆందోళనకు దిగారు మంత్రి అవంతి శ్రీనివాస్‌ని అడ్డుకున్నారు. బాధితుల సర్వేలో తమ ప్రాంతానికి అన్యాయం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజంతా పార్క్ కాలనీ, టైలర్స్ కాలనీ, బాపూజీ నగర్‌లను సర్వే నుంచి మినహాయించడంపై అభ్యంతరం తెలిపారు. బాధిత గ్రామాల మధ్య చీలిక తెస్తున్నారని ఇది కాదని అన్నారు. కంపెనీకి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామంపై వివక్ష ఎందుకని ప్రశ్నించారు. వైద్యపరంగా తమకు కూడా హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం, మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. చివరికి ఆందోళనకారుల్ని పక్కకు తప్పించి మంత్రి కాన్వాయ్‌కి రూట్ క్లియర్ చేశారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story