ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావణం.. సూర్యుడిని కమ్మేసిన మబ్బులు
By - TV5 Telugu |10 May 2020 9:00 PM GMT
ఢిల్లీని కారుమబ్బులు కమ్మేశాయి. పట్టపగలే చిమ్మ చీకట్లు అలముకున్నాయి. గాలి దుమారానికి దేశ రాజధాని చిగురుటాకులా వణికిపోయింది. దుమ్ము, ధూళి మేఘాలు ఆవరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాదిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నడి వేసవిలో మండే సూర్యుడ్ని మబ్బులు కమ్మేశాయి. ఒక్కసారిగా గాలుల తీవ్రత పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వర్షం పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com