లోకో పైలట్లు విషవాయువు బారిన పడ్డారన్నది అవాస్తవం: బొత్స
By - TV5 Telugu |11 May 2020 7:25 PM GMT
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన సంభవించిన వెంకటాపురంలో ఏపీ మంత్రులు పర్యటించారు. అక్కడ జరుగుతున్న శానిటైజేషన్ పనుల్ని మంత్రులు బొత్స, అవంతి శ్రీనివాస్ పరిశీలించారు. GVMC అధికారులు సూచించిన విధంగా ప్రజలు ఇళ్లలోకి వెళ్లాలని.. ప్రజలకు మంత్రులు సూచించారు. ఇళ్లలో ఏసీలు ఆన్ చేయవద్దన్నారు. గ్రామాల్లో వచ్చేవారికి ఆహారంతోపాటు వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వార్డు వాలంటీర్లు, అధికారులు గ్రామాలను పర్యవేక్షణ చేసి.. సమస్యలను పరిష్కరిస్తామన్నారు. లోకో పైలట్లు విషవాయువు బారిన పడ్డారన్నది అవాస్తవమని మంత్రి బొత్స అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com