వెంటిలేటర్‌‌లో మంటలు.. కరోనా బాధితులు మృతి

వెంటిలేటర్‌‌లో మంటలు.. కరోనా బాధితులు మృతి

రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఐసీయూలోని వెంటిలేటర్ లోని సాంకేతిక లోపం వలన పలువురు కరోనా బాధితులు మృతి చెందారు. వెంటిలేటర్ లో మంటలు రావటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. వెంటిలేటర్ల సామార్థ్యానికి మించి వాటిని వినియోగించాల్సి వస్తోందని.. దీంతో పరికరంపై ఒత్తిడి పెరిగి ఓవర్ లోడ్ అయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో.. ఒక్కసారిగా అందులో మంటలు చెలరేగడంతో వాటిపై ఉన్న కరోనా బాధితులు మృతి చెందారని తెలిపారు. ఈ విషయాన్ని రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. కానీ, మృతుల సంఖ్య మాత్రం ప్రకటించలేదు. ఈ ఘటన సమాచారం అందగానే ఆస్పత్రి నుంచి తక్షణం 150 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించామని ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story