వీరంగం సృష్టించిన పలాస ఎమ్మెల్యే అప్పలరాజు
By - TV5 Telugu |13 May 2020 1:58 PM GMT
శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు వీరంగం సృష్టించారు. మందస మండలానికి చెందిన ఓ బృందం బస్సులో ఒడిశాలో పెళ్లికి వెళ్లింది. తిరగు ప్రయాణంలో వారిని మెలియాపుట్టి మండలం పట్టుపురం అంతర్ రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బస్సుకు అనుమతులు లేవంటూ ఆపేశారు. దీంతో పెళ్లి బృందం.. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లింది. రంగంలో దిగిన ఎమ్మెల్యే.. తనవారిని విడిచిపెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు వినకపోవడంతో.. తన అనుచరులతో అక్కడికి చేరుకుని నానా హంగామా చేశారు. ఎమ్మెల్యే మాటే వినరా అంటూ చెక్పోస్ట్ను ధ్వంసం చేశారు అనుచరులు. అనంతరం పెళ్లి బృందాన్ని అక్కడనుంచి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనతో పోలీసులు విస్తుపోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com