రాష్ట్రంలో ఆస్తులన్ని అమ్మేసి ఏపీని చంపుతున్నారు : లోకేష్
By - TV5 Telugu |14 May 2020 2:27 PM GMT
నిధుల కోసం ప్రభుత్వ భూములను అమ్మేయాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టారు లోకేష్. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని చంపేస్తున్నారని విమర్శించారు. భవిష్యత్ అవసరాలను పట్టించుకోకుండా..ఉన్న ఆస్తులన్ని అమ్మేస్తే ఎలా అన్నది ఆయన వాదన. ప్రభుత్వం తీరుపై ఫైర్ అయిన లోకేష్..ఈ కార్యక్రమం 'మిషన్ బిల్డ్ ఏపీ' కాదని, 'జగన్ కిల్డ్ ఏపీ' అని ట్వీట్ చేశారు. తల్లిదండ్రులను గొంతు కోసి చంపిన ఉన్మాది కొడుకు..తరువాత వారికి పెద్ద గుడి కట్టిస్తానని ప్రకటించినట్లుగా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com