ఆర్టీసీ.. ఒకేసారి ఆరువేల మంది ఉద్యోగులను..

ఆర్టీసీ.. ఒకేసారి ఆరువేల మంది ఉద్యోగులను..

కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తుంటారు. ఇప్పుడు ఒక్కసారే ఆరువేల మంది ఉద్యోగులను తొలగించింది ఏపీఎస్ ఆర్టీసీ. లాక్డౌన్ నేపధ్యంలో నెల పదిహేను రోజుల నుంచి ఇంటి వద్దనే ఉంటున్నారు ఉద్యోగులు. ఇక ఇప్పుడు లాక్డౌన్ సడలించినా విధుల్లోకి తీసుకునే ప్రసక్తి లేదని వారిని విధులకు హాజరు కావొద్దంటూ డిపో మేనేజర్లు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. వీరికి ఏప్రిల్ నెల వేతనాలు ఇంకా అందజేయలేదు. అయితే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం తీరును ఖండిస్తున్నాయి. ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. బాలకాశి, కార్యదర్శి నూర్ మొహమ్మద్ డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story