జూన్ 20లోగా డిగ్రీ పరీక్షలు..
By - TV5 Telugu |16 May 2020 9:01 PM GMT
ఎంజియూ పరిధిలో జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన డిగ్రీ సెమిస్టర్, బ్యాక్లాగ్ పరీక్షలకు విద్యార్ధులు సిద్ధంగా ఉండాలని ఎంజీయూ రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ ఎం. యాదగిరి సూచించారు. డిగ్రీ పరీక్షల నిర్వహణపై కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 10 నుంచి 20 లోగా ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. 2,4,6వ సెమిస్టర్స్ రెగ్యులర్, బ్యాక్లాగ్, 1,3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష ఫీజులను జూన్ 1 నుంచి వారంలోగా చెల్లించాలని సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com