జూన్ 20లోగా డిగ్రీ పరీక్షలు..

జూన్ 20లోగా డిగ్రీ పరీక్షలు..

ఎంజియూ పరిధిలో జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన డిగ్రీ సెమిస్టర్, బ్యాక్‌లాగ్ పరీక్షలకు విద్యార్ధులు సిద్ధంగా ఉండాలని ఎంజీయూ రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ ఎం. యాదగిరి సూచించారు. డిగ్రీ పరీక్షల నిర్వహణపై కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 10 నుంచి 20 లోగా ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. 2,4,6వ సెమిస్టర్స్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, 1,3వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష ఫీజులను జూన్ 1 నుంచి వారంలోగా చెల్లించాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story