శ్రీనగర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

భారత సైన్యం శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. నవకదల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. సోమవారం రాత్రి ప్రారంభమైన ఈ ఎన్ కౌంటర్ 10 గంటలపాటు భీకరంగా కొనసాగింది. ఇందులో హతమైన ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారో ఇంకా తెలియలేదు. ఆర్టికల్ 370 రద్దు తరువాత ఉగ్రవాదుల చొరబాట్లు బాగా పెరిగాయి. దీంతో.. అప్పటి నుంచి సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు కలిసి 80మంది ఉగ్రవాదులను హతమార్చారు.

Tags

Read MoreRead Less
Next Story