హైదరాబాద్లో సిటీ బస్సులకు అనుమతి లేదు : కేసీఆర్

X
By - TV5 Telugu |19 May 2020 3:34 AM IST
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు మంగళవారం నుంచి నడుస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. జిల్లాలకు చెందిన బస్సులు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులకు, ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతిలేదని స్పష్టం చేశారు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని కేసీఆర్ హెచ్చరించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చు అని తెలిపారు. పరిశ్రమలన్నింటికీ అనుమతి ఇస్తున్నట్లు పేర్కోన్నారు. హైదరాబాద్ నగరంలో సరిబేసి విధానంలో దుకాణాలు తెరుచుకుంటాయి అని తెలిపారు. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు అనుమతి లేదని వివరించారు. అన్ని రకాల విద్యాసంస్థల బంద్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ సృష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com