ఆ సంస్కరణలో లోపాలేంటో కేసీఆర్‌ చెప్పాలి? : కిషన్ రెడ్డి

ఆ సంస్కరణలో లోపాలేంటో కేసీఆర్‌ చెప్పాలి? : కిషన్ రెడ్డి

కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ బోగస్‌ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తప్పుబట్టారు. కేంద్రం ప్యాకేజీతో తెలంగాణ ప్రజలకు మేలు జరగలేదా అని ప్రశ్నించారు. FRBM పరిమితిని 3 నుంచి 5 శాతం పెంచామని.. ఈ సంస్కరణలో లోపాలేంటో కేసీఆర్‌ చెప్పాలన్నారు.

తెలంగాణలో పంటలు వేసే విధానాన్ని కేంద్రం వ్యతిరేకించడం లేదని.. అలాంటప్పుడు ప్రధాని ఓ నియమం పెడితే దాన్ని ఎందుకు విమర్శిస్తున్నారని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదన్నారాయన.

Tags

Read MoreRead Less
Next Story