ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు రైతులు మృతి
By - TV5 Telugu |20 May 2020 11:41 AM GMT
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పనస పళ్ల లోడుతో వెళ్తున్న లారీ.. ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు రైతులు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. యూపీలో ఎటావా వద్ద తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో.. ఈ లారీ మరో వాహనాన్ని ఢీకొట్టింది. క్షతగాత్రులను సమీపంలో ఆసుపత్రికి తరలించారు. అతివేగంతో పాటు పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com