శ్రీవారి పాదాల చెంతకు ఆర్టీసీ బస్సులు

శ్రీవారి పాదాల చెంతకు ఆర్టీసీ బస్సులు

తిరుమల శ్రీవారి పాదాల చెంతకు ఆర్టీసీ బస్సులు నడపాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ నిర్వహించిన ట్రయల్ రన్‌ విజయవంతం కావడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆర్టీసీ ఎస్‌ఎంఎల్‌ బస్సులతో నిర్వహించిన ట్రయల్ రన్‌ ఫెయిల్‌ అయ్యింది. దీంతో బస్సు సర్వీసులపై పునరాలోచనలో పడింది. తాజాగా హైపవర్‌ టర్బో ఇంజన్‌ సామర్థ్యం కలిగిన బస్సుతో అధికారులు నిర్వహించిన ట్రయల్ రన్‌ సక్సెస్‌ కావడంతో.. ఇకపై శ్రీవారి పాదాల వద్దకు ఆర్టీసీ బస్సులు సేవలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఇదివరకు శ్రీవారి పాదాల చెంతకు వెళ్లాలంటే ప్రైవేట్‌ టాక్సీలే దిక్కుగా ఉండేది.

Tags

Read MoreRead Less
Next Story