హైకోర్టు తీర్పు డాక్టర్ సుధాకర్ తీరును సమర్ధించేలా ఉంది: వైసీపీ ఎమ్మెల్యే

X
By - TV5 Telugu |24 May 2020 8:12 PM IST
హైకోర్టు తీర్పులపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న కేసులను కూడా సీబీఐ విచారణకు ఆదేశిస్తే ప్రతి పోలీసు స్టేషన్ వద్ద సీబీఐ ఆఫీసులు పెట్టాల్సి వస్తుందని ఆయన ప్రకాశం జిల్లా చీరాలలో అన్నారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ అంశం పెట్టీ కేసు మాత్రమేనని ఆమంచి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. డాక్టర్ సుధాకర్ తీరును సమర్ధించేలా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతుందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com