ఏపీలో మరోసారి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మరోసారి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనామహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. కొత్తగా మరో 48 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

రాష్ట్రంలో సోమవారం ఉదయం 9 గంటలనుంచి మంగళవారం ఉదయం 9 గంటలవరకూ 8,148 సాంపిల్స్‌ ని పరీక్షించగా 48 మంది కోవిడ్-‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఇక 55 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్డ్‌ అయ్యారు. కరోనా కారణంగా తూర్పు‌ గోదావరి లో ఒక్కరు మరణించారు. నమోదైన మొత్తం 2719 పాజిటివ్‌ కేసులకు గాను 1903 మంది డిశ్చార్డ్‌ కాగా, 57 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 759 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story