లాక్డౌన్ నుంచి ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఊరట
By - TV5 Telugu |26 May 2020 10:31 PM GMT
హైదరాబాద్ లో చిక్కుకున్న ఏపీ సచివాలయ ఉద్యోగులను ఏపీకి తీసుకువెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సచివాలయ ఉద్యోగులకు ఊరట లభించింది. లాక్ డౌన్ వలన హైదరబాద్ లో చిక్కుకున్న వారిని తీసుకెళ్లేందకు అనుమతిని కోరుతూ.. ఏపీ సీఎస్ నీలం సాహ్ని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్కు లేఖ రాశారు. దీనికి తెలంగాణ సీఎస్ నుంచి అనుమతి లభించింది. దీంతో 400 మంది హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకోనున్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో అమరావతి చేరుకోనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com