కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి
By - TV5 Telugu |28 May 2020 4:47 PM GMT
కోవిడ్ -19 లక్షణాలు ఉండడంతో బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పత్రా గుర్గావ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనను గుర్గావ్లోని మెదంత ఆసుపత్రిలో చేర్పించినట్లు సదరు ఆసుపత్రి వర్గాలు గురువారం తెలిపాయి. బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పత్రా కు కోవిడ్ -19 లక్షణాలను చూపించినట్టు వర్గాలు తెలిపాయి. పలు న్యూస్ ఛానెళ్లలో బీజేపీ తరుఫున చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు సంబిత్ పత్రా.. అంతేకాదు బీజేపీ తరుఫున ఎక్కువగా కనిపించేది కూడా పత్రానే.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్న ఆయన గురువారం కూడా పలు ట్వీట్లను పోస్ట్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com