తమిళనాడులో కొత్తగా 817 మందికి కరోనా..

తమిళనాడులో కొత్తగా 817 మందికి కరోనా..

తమిళనాడులో కరోనావైరస్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. తాజాగా 817 మందికి పాజిటివ్ అని తేలింది, అలాగే బుధవారం 6 మరణాలు నివేదించబడ్డాయి.. 567 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,545 గా ఉంది, ఇందులో 133 మరణాల తోపాటు 9,909 మంది డిశ్చార్జ్ అయ్యారని తమిళనాడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

కాగా గత 24 గంటల్లో 6,387 కొత్త కేసుల తర్వాత భారతదేశం ఇప్పుడు 1.51 లక్షలకు పైగా కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. భారతదేశంలో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 4,337 గా ఉంది. వివిధ రాష్ట్రాల్లో మొత్తం 64,425 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 83,004 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story