రమేష్ కుమార్ తొలగింపు ముమ్మాటికీ కక్షసాధింపు చర్యే : కామినేని
By - TV5 Telugu |29 May 2020 2:08 PM GMT
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వివాదంలో హైకోర్టు తీర్పు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్నారు మాజీ మంత్రి కామినేని. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ ను కొట్టివేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. ఎన్నికల సంస్కరణల ముసుగులో రమేష్ కుమార్ పై కక్షసాధించేందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తప్పులు దిద్దుకొని..కక్షసాధింపు చర్యలకు బదులు అభివృద్ధి పనులు చేయాలని కామినేని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com