నేపాల్‌లో విషాదం.. 12 మంది మృతి

నేపాల్‌లో విషాదం.. 12 మంది మృతి

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసకూలీలతో వెళుతోన్న వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో 12 మంది మృతిచెందారు.. మరో 29 మంది గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నేపాల్‌లోని సల్యాన్‌ జిల్లాకు చెందిన కొంతమంది కార్మికులు ఉపాధి కోసం భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో గల బరేచ్‌ జిల్లాకు వలస వచ్చారు. ఈ క్రమంలో లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో వీరంతా ఓ ప్రైవేటు వాహనంలో స్వస్థలానికి పయనమయ్యారు.

అయితే ఆదివారం అర్ధరాత్రి నేపాల్‌లోని బాంకే జిల్లా అడవి సమీపంలోకి చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ఓ ట్రక్కును ఢీకొట్టింది. దాంతో పెద్ద ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడిక్కడే మరణించారు. గాయపడిన వారిని నేపాల్‌గంజ్ నగరంలోని భేరి ఆసుపత్రికి తరలించారు అని బాంకే జిల్లా అధికారి రాంబహాదూర్ కురుంగ్వాంగ్ చెప్పారు. కాగా చనిపోయిన వారిలో 11 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story