ఏపీలో కొత్తగా 76 కరోనా కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 76 కరోనా కేసులు నమోదు

ఏపీలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 10 వేల 567 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 76 కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 వేల 118కి చేరుకుంది. అటు కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 64కు చేరింది. ప్రస్తుతం 885 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 2 వేల 169 మంది డిశ్చార్జి అయ్యారు. నెల్లూరు జిల్లాలో నమోదైన 8 కేసులకు కోయంబేడు లింకు వున్నట్టు తెలుస్తోంది. అటు విదేశాల నుంచి వచ్చిన వారిలో 112 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 446 మందిలో ప్రస్తుతం 249 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్ప సొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story