మహారాష్ట్రలో కొత్తగా 2,361 కరోనా కేసులు

మహారాష్ట్రలో కొత్తగా 2,361 కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా మరో 2,361 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు మొత్తం కేసులు 70వేల మార్కును కూడా దాటాయి. రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ రోగుల సంఖ్య 70,013 కు చేరుకుంది. అలాగే కొత్తగా 76 మరణాలు సంభవించాయి.. దాంతో రాష్ట్రంలో మరణించిన మొత్తం సంఖ్య ఇప్పుడు 2,362 గా ఉంది. మరణించిన వారిలో 40 మంది ముంబైలో, పూణేలో 8, నవీ ముంబైలో 6, మీరా భయాందర్, వాసాయి విరార్ ప్రాంతాల్లో ముగ్గురు,

కల్యాణ్ డొంబివ్లి మరియు రాయ్ ఘడ్, థానే, నాసిక్, పింప్రి చిన్చ్వాడ్, జల్నా, బీడ్ మరియు నాగ్పూర్లలో ఒక్కో మరణం సంభవించింది. రాష్ట్రంలో యాక్టీవ్ కేసులు 37,543 ఉంటే.. 1,413 కొత్త కేసులతో కలిపి ముంబైలో మొత్తం 41,099 కరోనావైరస్ పాజిటివ్ కేసులున్నాయి. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 30,108 కు చేరుకోగా వాటిలో 22,789 క్రియాశీల కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ గణాంకాలు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story