ప్రపంచంలో మొట్టమొదటి ప్లాస్టిక్ రహిత ఫేస్ షీల్డ్.. ధర కేవలం 48 రూపాయలే..

ప్రపంచంలో మొట్టమొదటి ప్లాస్టిక్ రహిత ఫేస్ షీల్డ్.. ధర కేవలం 48 రూపాయలే..

పర్యావరణ పరిరక్షణ మరియు ప్లాస్టిక్‌లకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్న 'ఎ ప్లాస్టిక్ ప్లానెట్' సంస్థ ప్రత్యేక పిపిఇ

ఫేస్ షీల్డ్ రూపొందించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్ రహిత పిపిఇ ఫేస్ షీల్డ్. దీనిని చెక్క సెల్యులోజ్ , కాగితం సహాయంతో తయారు చేయబడుతుంది. దీని అమ్మకం త్వరలో ప్రారంభమవుతుంది. ఒక పిపిఇ షీల్డ్ ధర రూ .48 గా ఉంది.

అలాగే 150 పిపిఇ ఫేస్ షీల్డ్ లు గల ప్యాకెట్ 7000 రూపాయలకు అందుబాటులో ఉంచనున్నారు. దీనిని ఉత్పత్తి చేసే 'ఎ ప్లాస్టిక్ ప్లానెట్' సంస్థ డిజైనర్ ప్రకారం, హెడ్‌బ్యాండ్‌ను సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు. దీని ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం లేదని అమెరికన్ కంపోస్టింగ్ కౌన్సిల్ పేర్కొంది. పైగా ఇది ప్లాస్టిక్ రహితంగా ఉండటం వలన, ఇది వ్యర్థాలలో 3 రోజుల్లో కలిసిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story