బ్రెజిల్ లో కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో మరణాలు చూస్తే..

X
By - TV5 Telugu |4 Jun 2020 1:58 AM IST
బ్రెజిల్ లో కరోనావైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో మొత్తం 1262 మంది మరణించారు. దాంతో మృతుల సంఖ్య 31 వేలు 199గా ఉంది. బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, సుమారు 29 వేల కొత్త అంటువ్యాధులు కనుగొనబడ్డాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5 లక్షలా 55 వేల 383 మందికి వ్యాధి సోకినట్లు గుర్తించారు. బ్రెజిల్ లో సావో పాలో అనే
ప్రాంతం అత్యంత ప్రభావితమైన నగరంగా ఉంది. 24 గంటల్లో ఇక్కడ 327 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ మంగళవారం బ్రెజిల్కు హెచ్చరిక జారీ చేసింది. పరిస్థితిని నియంత్రించకుంటే, అంటువ్యాధి అక్కడ చాలా వేగంగా పెరుగుతుందని హెచ్చరించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com